HomeTelugu Newsఇన్‌స్టాగ్రామ్‌ లో కొడుకుల ఫొటోలు షేర్‌ చేసిన: ఎన్టీఆర్‌

ఇన్‌స్టాగ్రామ్‌ లో కొడుకుల ఫొటోలు షేర్‌ చేసిన: ఎన్టీఆర్‌

జూనియర్ ఎన్టీఆర్‌ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. కొడుకు పుట్టే ముందు రోజే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్‌ షేర్‌ చేశారు. అభయ్‌ తన ఓడిలో చిన్ని తమ్ముడిని ఆడిస్తుండగా ఎన్టీఆర్‌ వారిని తన ఫోన్‌తో ఫొటో తీస్తున్నారు. ఈ ఫొటోను ఎన్టీఆర్‌ అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ నెల 14న రెండో సారి తండ్రి అయిన విషయాన్ని ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.

1 15

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. దసరాకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!