HomeTelugu Big Stories'మిస్టర్' డేట్ ఫైనల్ చేశాడు!

‘మిస్టర్’ డేట్ ఫైనల్ చేశాడు!

వ‌రుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘మిస్ట‌ర్‌’ ఏప్రిల్ 13న విడుద‌లవుతోంది. లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ సెవ‌న్ ఏక‌ర్స్ స్టూడియోలో సెట్లో ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఇంకో పాట మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఆ పాట‌ను ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఇట‌లీలో తెర‌కెక్కించ‌నున్నారు.
ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ”ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుద‌ల చేస్తున్నాం. ఒక్క పాట‌ మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్తైంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. చ‌క్క‌టి భావోద్వేగాల‌కు, క‌డుపుబ్బ న‌వ్వుకునే వినోదానికి, విన‌సొంపైన సంగీతానికి, క‌నువిందు చేసే దృశ్యాల‌కు అనువుగా ఉన్న క‌థ ఇది. అవుట్‌పుట్ చాలా సంతృప్తిక‌రంగా ఉంది. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎలాంటి కాంప్ర‌మైజ్ లేకుండా తీయ‌గ‌లిగాను. ట్రావెల్ ఫిల్మ్ త‌ర‌హాలో సాగుతుంది ‘మిస్ట‌ర్‌’. స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశాం. అలాగే ఇండియాలో చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశాం. ఇటీవ‌ల అన్న‌పూర్ణ సెవ‌న్ ఏక‌ర్స్ స్టూడియోలో ఓ సెట్ సాంగ్ చేశాం. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఇట‌లీలో తెర‌కెక్కించే పాట‌తో షూటింగ్ పార్ట్ పూర్త‌వుతుంది. మిక్కి జె.మేయ‌ర్‌తో ఫ‌స్ట్ టైం ప‌నిచేశాను. ఇందులో ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. మిక్కి అన్ బిలీవ‌బుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏప్రిల్ మొద‌టివారంలో ప్రీ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu