HomeTelugu Big Storiesరామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'!

రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘నేను శైలజ’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా నిర్మాణంలో ఉంది. ‘స్రవంతి’ రవికిశోర్, పి.ఆర్‌. సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కష్ణచైతన్య నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్ లో 50 శాతం పైగా సినిమా పూర్తయింది. ఈ నెల 7న ఊటీలో షెడ్యూల్ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ – “స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 6న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఉన్న ‘ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు…’ అనే పాటకు సంబంధించిన ‘లిరికల్ వీడియో’ను విడుదల చేయబోతున్నాం. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ అన్ని పాటలకూ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఊటీలో జరపనున్న భారీ షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది. ఆ పాటను వచ్చే నెల ఇటలీలో చిత్రీకరిస్తాం. దసరాకి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu