సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే పులువురు కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం కరోనా భారిన పడి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో పాటు ఆయన కుటుంబసభ్యులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక తాజాగా మరో టాలీవుడ్ మరో దర్శకుడు కరోనా భారినపడ్డారు. ప్రముఖ డైరెక్టర్ తేజ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా తేజ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు మరియు యూనిట్ సభ్యులందరికీ నెగిటివ్ వచ్చింది. దాంతో ప్రతుతం తేజ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.