HomeTelugu Trendingశ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్‌

శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్‌

1 6
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బన్నీ తన ఫ్యామీలితో పాటు ‘అల వైకుంఠపురములో’ మూవీ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి వెంకన్నను దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. బన్నీ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించాడు.

కాగా ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న బన్నీ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిత్రంలో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇక ఇప్పటికే డైరెక్టర్‌లకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన ఈ హీరో తాజాగా బంధువులకు, సన్నిహితులకు కూడా ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు. కాగా ఫిలిం జర్నలిస్టుల సంక్షేమానికిగానూ బన్నీ రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu