Homeపొలిటికల్కుటుంబాన్నే మోసం చేశాడు, ఇక ముస్లింలు ఎంత ?

కుటుంబాన్నే మోసం చేశాడు, ఇక ముస్లింలు ఎంత ?

He cheated the family what about the Muslims

జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ముస్లిం మైనార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాడు. కానీ, ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ముస్లిం మైనార్టీలకు ఆ స్థాయిలో మొండిచెయ్యి చూపించిన ఘనత ఒక్క జగన్ రెడ్డికే సాధ్యం అయింది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రతి రాజకీయ నాయకుడు భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా చూడాలని.. ఇదే జగన్ రెడ్డి తెగ క్లాస్ లు పీకాడు. మరీ సీఎం అయ్యాక ఖురాన్ ను జగన్ రెడ్డి ఎలా మర్చిపోయాడు ?. అయినా, అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి కుటుంబాన్నే మోసం చేశాడు. ఇక ముస్లిం మైనార్టీ ప్రజలు ఎంత ?.

కాకపోతే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి ముస్లిం మైనార్టీల సభలో మాట్లాడుతూ.. ‘పేద ముస్లిం మహిళలకు దులహన్ పథకం ద్వారా తన ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ, గద్దెనెక్కిన తర్వాత జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు. ముస్లిం మైనార్టీ ప్రజలను దారుణంగా మోసం చేశాడు.నిజానికి కొన్ని నియోజకవర్గాల్లో కేవలం ముస్లిం మైనార్టీల అండతోనే జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్ రెడ్డికి ముస్లిం మైనారిటీ సమాజం అండగా ఉండి గెలిపించింది. అందుకు తగ్గ గుణపాఠం జగన్ వారికీ బాగానే చెప్పాడు. ముస్లిం మైనార్టీలను జగన్ చాలా నీచంగా దగా చేశాడు.

అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలకు ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా రంజాన్ తోఫా, ఇమామ్ మౌజన్ లకు గౌరవ వేతనాలు, దుల్హన్ పథకం, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య, స్కాలర్షిప్ లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు, కుట్టు మిషన్లు, హజ్ హౌస్, షాదీఖానా లు ఇలాంటి అనేక రకాలుగా మైనార్టీలను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వం. కానీ, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు చేతిలో చిప్ప మిగిలింది. జగన్ రెడ్డి తన మూడున్నర సంవత్సరాల పరిపాలనలో అన్ని కోతలు, మోసాలతోనే కాలం గడిపాడు.

అయినా.. జగన్ రెడ్డికి విదేశాలకు వెళ్లడానికి, సభలు పెట్టుకోవడానికి, కనిపించిన ప్రతి చోటా తన పార్టీ రంగులు వేసుకోవడానికి నిధులు ఉన్నాయి. కానీ, కేవలం ముస్లింలను ఆదుకోవడానికి మాత్రం నిధులు లేవా ?, పైగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీలపై దాడులు ఎక్కువైపోయాయి. దీనికితోడు జగన్ గోరు ఎప్పుడు మైనార్టీలపై కోతలు విధిస్తూనే ఉంటారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ముస్లిం మైనార్టీలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈర్ష్యాద్వేషాలు అతీతంగా, కక్షా కార్పణ్యాలకు దూరంగా పరస్పర సోదరభావంతో జీవించడమే ప్రవక్త ప్రబోధం. ఈ జగన్ రెడ్డి పాలనలో ఆ సోదరభావం పోయింది, ఆ ప్రబోధం మసకబారింది. కాబట్టి.. జగన్ తగిన మూల్యం చెల్లించక తప్పదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu