రాయదుర్గంలో స్టార్ హీరో ప్రభాస్ కట్టించుకున్న గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వానిదని కొన్నిరోజుల క్రితం రెవిన్యూ అధికారులు గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు ప్రభాస్ తరపు న్యాయవాది గతంలో ఆ స్థలాన్ని ప్రభాస్ తండ్రితో కొన్నారని, క్రమబద్దీకరణ కోసం చేసుకున్నామని అన్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రభాస్ కు అనుకూలంగా తీర్పునిస్తే కబ్జాదారులను హక్కుదారులుగా చేసినట్టు అవుతుందని అన్నారు. ఇరు వాదనలు విన్న కోర్టు ప్రభాస్ విషయం కనుక ఆచితూచి వ్యవహరిస్తున్నామని తీర్పును రిజర్వులో ఉంచింది.