జనసేన పార్టీ లెటర్ హెడ్ నకిలీదని జనసేన లీగల్ సెల్ నేతలు తేల్చారు. వాటిని తయారు చేసిన వారిపై బెజవాడ సీపీకి జనసేన లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకం ఫోర్జరీ, ఇంటర్నెట్ లో దుష్ప్రచారంపై నేతలు సీపీకి ఫిర్యాదు చేశారు.
ఇటీవలే పవన్ కల్యాణ్ ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. యువత, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పవన్ ప్రకటించినా.. ఎవరు? ఎక్కడ? నుండి పోటీ చేస్తారనేది మాత్రం ప్రకటించలేదు. ఈలోగా కృష్ణా జిల్లాలో కొన్ని అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు వచ్చాయి. పవన్ కల్యాణ్ సంతకం చేసినట్లు జనసేన లెటర్ హెడ్స్ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. దీంతో విజయవాడ జనసేన లీగల్ సెల్ నేతలు జనసేన లెటర్ హెడ్స్ నకిలీవని తేల్చి.. బెజవాడ సీపీకి ఫిర్యాదు చేశారు.