Homeతెలుగు Newsచీకటి ఒప్పందం బహిర్గతం అయ్యింది

చీకటి ఒప్పందం బహిర్గతం అయ్యింది

9 11ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారని.. ఇంత కాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతం అయ్యిందని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ట్వీట్‌ చేశారు. నాలుగున్నర ఏళ్ల పాటు విభజన చట్టం ప్రకారం అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటా దక్కకుండా అడ్డుపడుతున్న కేసీఆర్‌తో కలిసి జగన్ ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేశారంటూ విమర్శించారు. లంకలో పుట్టినవాళ్లు అంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు అని ఆంధ్రులను కేసీఆర్‌ అవమానించారని.. ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందని అవహేళన చేసిన కేసీఆర్‌తో జగన్‌ జతకట్టడం సరికాదని లోకేష్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu