డైరెక్టర్ పూరీ జగన్నాథ్పై హీరో రామ్ చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు. పూరీ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ను చూసిన చెర్రీ ఫేస్బుక్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నారు. చిత్రం నచ్చిందని తెలిపారు. ‘రామ్, ఇతర నటీనటులు చాలా ఎనర్జిటిక్గా నటించారు. పూరీ జగన్నాథ్కు శుభాకాంక్షలు. అన్నింటినీ ఒక్కచోటుకు చేర్చి, ఓ మంచి సినిమా తీసిన వ్యక్తి ఆయన’ అని పోస్ట్ చేశారు. దీంతోపాటు రామ్, పూరీ ఫొటోను కూడా షేర్ చేశారు. దీనికి రామ్ ట్విటర్లో స్పందించారు. ‘ధన్యవాదాలు సోదరా..’ అని పోస్ట్ చేశారు. పూరీ, చెర్రీ కాంబినేషన్లో ‘చిరుత’ వచ్చిన సంగతి తెలిసిందే.
అంతేకాదు నటుడు సుమంత్ కూడా పూరీకి శుక్రవారం అభినందనలు తెలిపారు. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం అందుకున్నందుకు రామ్, పూరీ, ఛార్మిలకు శుభాకాంక్షలు. మీ పట్ల చాలా చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఆయనకు కూడా రామ్ థాంక్స్ చెప్పారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలతోపాటు బాక్సాఫీసు వద్ద కూడా విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్ వెల్లడించింది.