HomeTelugu Big Storiesమాస్ టైటిల్ తో మెగాహీరో!

మాస్ టైటిల్ తో మెగాహీరో!

‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత దాదాపు ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకున్న దర్శకుడు వి.వి.వినాయక్ త్వరలోనే మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా కోసం ‘దుర్గ’ అనే టైటిల్ ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో.. తెరపై సినిమాను కూడా అదే
రేంజ్ లో వినాయక్ ఆవిష్కరిస్తాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఆకుల శివ ఈ సినిమాకు కథను అందించారు. ఈ సినిమాకి నిర్మాతగా ఠాగూర్ మధు పేరు వినిపించింది గానీ, బడ్జెట్ ఎక్కువవుతుందనే ఆలోచనతో ఆయన తప్పుకున్నాడనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి సి.కల్యాణ్ ముందుకు వచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ ‘జవాన్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెల నుండి వినాయక్ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu