Homeతెలుగు వెర్షన్శెట్టిపల్లె రఘురామి రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో ఆయన పరిస్థితేంటి ?

శెట్టిపల్లె రఘురామి రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో ఆయన పరిస్థితేంటి ?

Raghurami reddy
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే..  శెట్టిపల్లె రఘురామిరెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో శెట్టిపల్లె రఘురామిరెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి కడప జిల్లా చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామంలో రైతు కుటుంబంలో శెట్టిపల్లె రఘురామిరెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రఘురామిరెడ్డి 10వ తరగతి పూర్తి చేశారు. రఘురామిరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు రైతుగా ఉన్నారు. రఘురామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ప్రొద్దుటూరు సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో పార్టీలో చేరి 1985, 1999 లలో మైదుకూరు ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 1989, 1994, 2004, 2009 లలో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత కాలంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రఘురామిరెడ్డి  జగన్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని 2014, 2019 లలో మైదుకూరు ఎమ్మెల్యే గా విజయం సాధించారు. రఘురామి రెడ్డి సుధీర్ఘ కాలం రాజకీయాల్లో అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా  శెట్టిపల్లె రఘురామి రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో శెట్టిపల్లె రఘురామి రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో శెట్టిపల్లె రఘురామి రెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ శెట్టిపల్లె రఘురామి రెడ్డి కి ఉందా ?, చూద్దాం రండి. 
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న శెట్టిపల్లె రఘురామిరెడ్డి కు ప్రజల్లో మంచి పేరే ఉంది. పైగా వరుసగా మూడు సార్లు ఓడిపోయి ఎన్నో విషయాల్లో రాటు తేలారు. రాజకీయంగా ఎంతో పరిణితి సాధించారు.  అయితే గత కొంత కాలంగా మైదుకూరు నియోజకవర్గం లో  శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయులు, అనుచరులు చేస్తున్న సెటిల్మెంట్ మరియు ఇతరత్రా వ్యవహారాలు కారణంగా  శెట్టిపల్లె రఘురామి రెడ్డికు చెడ్డ పేరు వచ్చింది. దీనికితోడు ఇప్పటికే పలు వివాదాస్పద వ్యవహారాలలో శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయులు ఇరుక్కున్నారు. 
 
దాంతో  రాజకీయ నాయకుడిగా శెట్టిపల్లె రఘురామి రెడ్డి గ్రాఫ్ బాగా పడిపోయింది.  ప్రజల్లో శెట్టిపల్లె రఘురామి రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం కూడా ఏమీ బాగాలేదు. మరి ఈ నేపథ్యంలో  వచ్చే ఎన్నికల్లో  శెట్టిపల్లె రఘురామి రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ?,  ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. శెట్టిపల్లె రఘురామి రెడ్డి కి  మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్  లేదు.  ప్రజల్లో తన తనయులు వల్ల శెట్టిపల్లె రఘురామి రెడ్డి పై  తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలాగైనా  శెట్టిపల్లె రఘురామి రెడ్డిని తప్పించాలని అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి..  శెట్టిపల్లె రఘురామి రెడ్డి మళ్లీ గెలవడం దాదాపు అసాధ్యమే. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!