ప్రముఖ బిజినెస్ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఈ ఏడాది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని ఎంపిక చేశారు. కేసీఆర్ తరఫున ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ అవార్డుని అందుకున్నారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. 400 మందికి పైగా వ్యాపార రంగంలో లబ్ధప్రతిష్టుల సమక్షంలో 9 మంది విజేతలకు అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులు అందజేశారు.