HomeTelugu Newsపింక్‌ రీమేక్‌ అందుకే తీస్తున్నా..

పింక్‌ రీమేక్‌ అందుకే తీస్తున్నా..

12 1ఓ చక్కటి చిత్రం సాధ్యమైనంత వరకు అత్యధిక మంది ప్రేక్షకులకు చేరాలని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ అన్నారు. హిందీ, తమిళంలో హిట్‌ అందుకున్న ‘పింక్‌’ కథతో తెలుగులో సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించబోతున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దిల్‌రాజు, బోనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీ అయిన పవన్‌ కొత్త సినిమాకు సంతకం చేశారని తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా ‘పింక్‌’ను తెలుగులో రీమేక్‌ చేయడం గురించి బోనీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. హిందీ సినిమాను దక్షిణాదిలో రీమేక్‌ చేయడానికి కారణం గురించి ప్రస్తావిస్తూ.. ‘మంచి సినిమా వీలైనంత మందికి చేరువ కావాలి. హిందీలో నిర్మాతగా నా తొలి సినిమా ‘హమ్‌ పాంచ్‌’. ఇది కన్నడ సినిమా ‘పడువారల్లి పాండవురు’కు రీమేక్‌.

ఆపై నేను అనే తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్ని రీమేక్‌ చేశా. ‘నేర్కొండ పార్వై’ (‘పింక్‌’ తమిళ రీమేక్‌) విజయంతో మంచి సినిమా ఎప్పుడూ పరాజయం పొందదనే నమ్మకం నాలో ఏర్పడింది. కంటెంట్‌ బాగుంది కాబట్టి రీమేక్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. భావోద్వేగాలకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ స్పందిస్తారు’ అని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu