ఏపీలోని ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా చికిత్స కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకితెస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిసి వైద్యానికి ధరల ప్యాకేజీని నిర్ణయించింది. కనీస మొత్తంగా రూ. 16 వేలు, గరిష్టంగా రూ. 2.16 లక్షల వరకు చికిత్స ఫీజుగా నిర్ణయించింది. కరోనాకు సంబంధించిన 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా బారిన పడి చికిత్స చేయించుకోలేని పేదవారికి ఇది ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడనుంది.