HomeTelugu Trendingసింగిల్ ఫ్రేమ్ లో తారక్‌, చెర్రీ, అఖిల్‌.. ఫొటో వైరల్‌

సింగిల్ ఫ్రేమ్ లో తారక్‌, చెర్రీ, అఖిల్‌.. ఫొటో వైరల్‌

5 20టాలీవుడ్‌ స్టార్స్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అఖిల్‌ కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. మంగళవారం రాత్రి తారక్‌, చెర్రీ అఖిల్‌ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోను అఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘నాకు తెలిసిన మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ట్యాగ్‌ టీం. నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు బ్రదర్స్‌’ అని క్యాప్షన్‌ ఇస్తూ ‘బాయ్స్‌ విల్‌ బీ బాయ్స్‌’ అని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చారు. అయితే ఏ సందర్భంగా వీరు ముగ్గురూ కలుసుకున్నారో మాత్రం వెల్లడించలేదు. ఫొటోలో అఖిల్‌ పెంపుడు కుక్క కూడా ఉంది. వీరు ఫొటోకి పోజిస్తున్నప్పుడు కుక్క వారి వైపు తదేకంగా చూడటం ఫన్నీగా ఉంది. ఈ ఫొటో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే అరవై వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ‘మూడు సింహాలు ఒక్కచోట చేరాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. ఈ ఫొటోపై సినీ నటుడు మంచు మనోజ్‌ ట్విటర్‌ వేదికగా కామెంట్‌ చేస్తూ ‘క్యూటీస్‌. వీరి ముగ్గురిలో ఎవరు యంగ్‌గా ఉన్నారు?’ అంటూ చమత్కరించారు. అఖిల్‌ హీరోగా నటించిన ‘మిస్టర్‌ మజ్ను’ ప్రీ రిలీజ్‌ వేడుకకు తారక్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క చరణ్‌, తారక్‌.. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)మల్టీస్టారర్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల సినిమా రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu