అక్కినేని యంగ్ హీరోలు నాగచైతన్య, అఖిల్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని వినికిడి. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అజయ్ భూపతి మహాసముద్రం అనే పేరుతో ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నారు. ఈ కథతో చాలామందిని సంప్రదించారు. కథ బాగుంది అంటున్నా సినిమా చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఈ కథను ఇటీవలే చైతుకు వినిపించారట. సమంతకు కూడా బాగా నచ్చింది. మల్టీస్టారర్ గా చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. మల్టీస్టారర్ గా సినిమాను తెరకెక్కిస్తే.. అందులో అఖిల్ కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే నాగచైతన్య18 సినిమాలు చేయగా 19 సినిమాని తాజాగా ప్రారంభించారు. అటె అఖిల్ మూడె సినిమాలు చేశాడు. కానీ, మూడు సినిమాలు పెద్దగా కలిసిరాలేదు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాలుగో సినిమా చేస్తున్నాడు.