HomeTelugu Newsహైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ పేలుడు

హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ పేలుడు

10 15హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీవిక రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవనం శిథిలాల్లో చిక్కుకున్న అన్వర్‌, అంబరీష్‌ను పోలీసులు, అగ్నిమాక సిబ్బంది బయటకు తీశారు. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

రియాక్టర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన అన్వర్‌, అంబరీష్‌ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. రసాయన పరిశ్రమ కావడంతో పేలుడు తీవ్రతకు వాయువులు వెలువడి సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు కష్టంగా మారింది. భారీ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం పైకప్పు, గోడలు ధ్వంసమయ్యాయి. శకలాలు 500 మీటర్ల దూరం వరకు ఎగిరిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈపరిశ్రమ నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని గతంలో కాలుష్య నియంత్రణ మండలి, పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu