HomeTelugu Big Storiesత్వరలోనే ఖుషీ బాలీవుడ్‌ ఎంట్రీ: బోనీ కపూర్‌

త్వరలోనే ఖుషీ బాలీవుడ్‌ ఎంట్రీ: బోనీ కపూర్‌

Boney kapoor says khushi toదివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పటికే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఇక తాజాగా తన రెండోవ కూతురు ఖుషీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని తన తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ స్పష్టం చేశాడు. అయితే ఖుషీని మొదట పరిచయం చేసేది మాత్రం తాను కాదని పేర్కొన్నాడు. ఓ ఇంటర్య్వూలో బోనీ కపూర్‌ మాట్లాడుతూ.. ‘ఖుషీని సినిమాల్లో పరిచయం చేయడానికి నా దగ్గర అన్ని వనరులు ఉన్నాయి.

అయితే తనని మాత్రం మొదట పరిచయం చేసే వ్యక్తిని నేను కాదు. ఓ నిర్మాతగా నాకు, నటిగా తనకు ఇది మంచిది కాదు. ఎందుకంటే ఓ తండ్రిగా ఖుషీ తన సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.తనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుండటంతో ఆమె ఎంట్రీ తర్వలోనే ఉందని నెటిజన్‌లు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రైవసీలో ఉన్న తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌ను తాజాగా ఖుషీ పబ్లిక్‌ చేసింది. అనంతరం హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకోవడం ప్రారంభించింది. అవి చూసిన ఆమె ఫాలోవర్స్‌, నెటిజన్‌లు వెండితెరపై కనిపించేందుకు ఖుషీ సిద్దమైందని, ఆమె ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖుషీ లండన్‌లో ఫిలీం స్కూల్‌లో యాక్టింగ్‌ ట్రైనింగ్‌ తీసుకుంటుందని, త్వరలోనే తను నటిగా మీ ముందుకు వస్తుందని పలు ఇంటర్య్వూలో జాన్వీ కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu