
Amaravati Development Budget:
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మార్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ప్రపంచ బ్యాంక్ అమరావతి అభివృద్ధికి రూ.6,800 కోట్ల రుణాన్ని ఆమోదించింది. ఇది అమెరికన్ డాలర్లలో సుమారు 800 మిలియన్ డాలర్లు. ఆర్థిక సాయం ద్వారా నగరానికి అవసరమైన మౌలిక వసతులను అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇది మాత్రమే కాదు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) కూడా గతంలో రూ.6,700 కోట్ల రుణాన్ని అందించింది. ఈ మొత్తం సాయం అమరావతిని నగర రూపంలో పూర్తిగా మార్చడానికి దోహదపడుతోంది. ప్రస్తుతానికి అమరావతి జనాభా సుమారు 1,00,000 మందిగా ఉంది. 2050 నాటికి ఈ నగర జనాభా 35 లక్షల వరకు పెరుగుతుందని అంచనా. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరుగుతోంది.
పదేళ్లలో 50,000 కొత్త ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యం. అందరికీ అందుబాటులో ఉండే గృహాలు అందించడంలో భాగంగా 22% హౌసింగ్ అలాట్ చేశారు. 17,000 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిలో 10,000 మంది మహిళలు ఉన్నారు, వారి జీవనోపాధి మెరుగుపరచడం ప్రాజెక్ట్లో ప్రధాన భాగం.
రహదారుల నిర్మాణం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అధునాతన నీటి పారుదల వ్యవస్థలు, తడి-వడి నిర్వహణ ఫెసిలిటీస్ వంటి పథకాలకు ప్రపంచ బ్యాంక్ రుణం ఉపయోగపడుతుంది. జల ప్రళయ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.
పర్యావరణ అనుకూల పరిష్కారాలతో నగర నిర్మాణం జరుగుతోంది. తక్కువ కార్బన్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే కాకుండా, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను కూడా అమలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ అందించిన ఈ రుణం 29 ఏళ్ల కాలపరిమితి, 6 ఏళ్ల గ్రేస్ పీరియడ్తో వచ్చింది. జపనీస్ యెన్ రూపంలో రుణం తీసుకోవడం ద్వారా రూ.33,137 కోట్ల విలువైన 45 ఇంజనీరింగ్ పనులు చేపడుతున్నారు.
టిడిపి ప్రభుత్వం ఈ పనులను వేగవంతం చేస్తోంది. ఐఏఎస్ అధికారుల కోసం నివాసాలు, రహదారులు, ప్రళయ నివారణ పథకాలు ప్రధాన ప్రాజెక్టులు. హుడ్కో ద్వారా రూ.11,000 కోట్లు, జర్మనీ బ్యాంక్ ద్వారా రూ.5,000 కోట్లు కూడా ఆర్థిక సాయం పొందారు. ప్రపంచ బ్యాంక్ సహాయంతో అమరావతి అభివృద్ధి మరింత వేగవంతం కానున్నాయి.
ALSO READ: Mufasa: The Lion King అభిమానుల అంచనాలను అందుకుందా?