జనసేన పార్టీ.. తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుమతిచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ తరఫున మద్దతు ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.