HomeTelugu Trendingఆ చిత్రం కోసం జాన్వీ బరువు పెరిగిందట.!

ఆ చిత్రం కోసం జాన్వీ బరువు పెరిగిందట.!

6 27శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ధఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా తరువాత ఈ అమ్మడు కరణ్ జోహార్ నిర్మిస్తున్న రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి గుంజన్ సక్సేనా బయోపిక్. ఇండియా ఫస్ట్ ఎయిర్ మార్షల్ గా పేరు తెచ్చుకున్న గుంజన్ .. జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో గుంజన్ కీలకపాత్ర పోషించింది.

మార్చి నుంచి జాన్వీ కపూర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నది. గుంజన్ సక్సేనా మేకోవర్ కోసం జాన్వీ కసరత్తులు ప్రారంభించింది. ఈ సినిమా కోసం ఏడు కేజీల బరువు పెరిగిందట. ఎయిర్ ఫైటర్ కావడంతో.. దానికి తగ్గట్టుగా బాడీని పెంచింది జాన్వీ. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. మే నుంచి కరణ్ జోహార్ తక్త్ సినిమాలో జాన్వీ జాయిన్ అవుతుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu