Homeతెలుగు Newsటీఆర్‌ఎస్ గెలవకపోతే నష్టపోయేది తెలంగాణనే: కేసీఆర్

టీఆర్‌ఎస్ గెలవకపోతే నష్టపోయేది తెలంగాణనే: కేసీఆర్

5 20

తెలంగాణ కోసం ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదని.. అలాంటిది ఇప్పుడు నన్ను ఎదిరించే దమ్ములేక చంద్రబాబుతో కలిసి కూటమి కట్టారంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ కొట్లాడితే.. మంత్రి పదవుల్లో ఊరేగిన దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అంటూ దుమ్మెత్తిపోశారు. 58ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి.. ఇప్పుడు కేసీఆర్‌ను ఢీకొట్టే దమ్ము లేక.. చంద్రబాబును భుజాలపై ఎక్కించుకొని తెలంగాణకు మోసుకొస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. తెలంగాణ ఆగమవుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు, కూటమి టార్గెట్‌గా మాటల తూటాలు పేల్చారు.

కాంగ్రెస్, టీడీపీలు కలిసి 58 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వాళ్లు ప్రజలకు ఏం చేశారో.. ఈ నాలుగేళ్లలో మేమేం చేశామో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. మళ్లీ ఇప్పుడు కూటమి కట్టి డ్రామాలాడుతున్నారని అన్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాను. కత్తి ఆంధ్రావాడు ఇస్తే.. పొడిచేవాడు తెలంగాణవాడు. వచ్చేది చంద్రబాబు అయినా.. తీసుకొచ్చేది మాత్రం కాంగ్రెసోళ్లు. వాళ్లకు కూడా చంద్రబాబు డబ్బు ఇవ్వాలి.. టికెట్లు ఇవ్వాలి. కొందరు అమరావతి గులాములైతే.. మరికొందరు ఢిల్లీ గులాములు.. ఏం దరఖాస్తులు పట్టుకొని అమరావతికి పోవాలా.. మీరే ఆలోచించుకోవాలి. ‘ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే సరి.. లేకపోతే నాకేం నష్టం లేదు. ఇంట్లో పడుకొని హాయిగా విశ్రాంతి తీసుకుంటా.. నష్టపోయేది తెలంగాణనే ఆలోచించుకోండి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్

1956లో తెలంగాణను కర్కశంగా ఆంధ్రలో కలిపింది ఈ కాంగ్రెస్‌ వాళ్లే. 1968లో ఏడుగుర్ని కాల్చి చంపింది ఎవరు.. తర్వాత తెలంగాణ పేరుతో 14ఏళ్లు ఏడిపించింది సోనియా గాంధీ కాదా.. తర్వాత స్వయంగా నేనే రంగంలోకి దిగి.. చావు నోట్లో తలపెడితే.. గ్రామ గ్రామాన ప్రజలు ఉద్యమం చేస్తే.. అప్పుడు కాంగ్రెస్ సర్వే చేసి.. నాలుగు సీట్లు వస్తాయని రాష్ట్రాన్ని ప్రకటించారు. అయినా ప్రజలు తెలివైనోళ్లు 2014లో వాళ్లకు అధికారం ఇవ్వలేదు. తర్వాత రాష్ట్రాన్ని, నాలుగేళ్ల పసిగుడ్డును జాగ్ర్తత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం అన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తుంటే మంత్రి పదవుల్లో ఊరేగిన పెద్ద మనుషులు ఈ కాంగ్రెస్సోళ్లు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ను గోక్కుంటా అసెంబ్లీలో కూర్చున్నారు. తెలంగాణకు కిరణ్ ఒక్క రూపాయి ఇవ్వనంటే మాట్లాడని దద్దమ్మలు వీళ్లు. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి కూటమి అంటూ వస్తున్నారు. బాబు తెలంగాణలో ప్రాజెక్టుల్ని ఆపాలంటూ 35 లేఖలు రాసి.. హైకోర్టు విభజన చేయకుండా అడ్డుపడి.. ఏడు మండలాలను గుంజుకుంది నిజం కాదా. ఇప్పుడు మళ్లీ కూటమి అంటూ వస్తున్నారు.. ఓసారి నేను తరిమేశా.. ఈసారి తరిమేసే బాధ్యత మీరు తీసుకోవాలి అని దుయ్యబట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu