HomeTelugu Newsనన్ను ఎవ్వరూ తిట్టలేదు.. అందుకు సంతోషిస్తున్నా: మనోజ్‌

నన్ను ఎవ్వరూ తిట్టలేదు.. అందుకు సంతోషిస్తున్నా: మనోజ్‌

4 27ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్ తనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించినందుకు ఎవ్వరూ తిట్టలేదని, అందుకు సంతోషిస్తున్నానని అంటున్నారు‌. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఇటీవల మనోజ్‌కు పద్మశ్రీని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గతంలో ప్రభుత్వం అవార్డులు ప్రకటించేటప్పుడు ఏ అర్హత ఉందని ఇచ్చారు అని సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్‌ చేసేవారు. సదరు నటుడు నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ నోటికొచ్చినట్లు తిట్టేవారు. కానీ ఈసారి నాకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అందుకు సంతోషంగా ఉంది. నాకు పద్మశ్రీ వచ్చినందుకు స్నేహితులు, కుటుంబీకులు, ఫాలోవర్లు తెగ సంబరపడిపోతున్నారు. నేను నిద్రపోయే ముందు అనుపమ్‌ ఖేర్‌జీ ఫోన్‌ చేసి ఈ శుభవార్త చెప్పారు. నాకు ఎలా స్పందించాలో అర్థంకాక కాసేపు షాక్‌లో ఉండిపోయాను. నాకు ఈ గౌరవం దక్కుతుందని అనుకోలేదు’ అని వెల్లడించారు మనోజ్‌.

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘సత్య’ సినిమాతో మనోజ్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన హిందీ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. ప్రస్తుతం మనోజ్‌ ‘సోన్‌ చిడియా’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్‌ చౌబే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu