కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఆరు సినిమాలను సెట్స్పైన ఉంచాడు. అందులో ‘మెర్రీ క్రిస్టమస్’ ఒకటి. శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అంధాధూన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లు బ్రేక్ తీసుకుని శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
రెడ్ వైన్తో ఉన్న రెండు గ్లాసులు పగిలినట్లు పోస్టర్లో చూపించారు. టైటిల్ పోస్టర్తోనే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమా హిందీతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఇక విజయ్ నేరుగా నటిస్తున్న తొలి హింది చిత్రం ఇదే కావడం విశేషం.
#MerryChristmas coming soon.#SriramRaghavan #KatrinaKaif @tipsofficial @RameshTaurani #SanjayRoutray #JayaTaurani @ipritamofficial #MatchboxPictures
Music on #Tips pic.twitter.com/bDPURdIdHa
— VijaySethupathi (@VijaySethuOffl) December 24, 2022