HomeTelugu Trendingఅదీ పౌరుషమంటే అంటున్న నాగబాబు

అదీ పౌరుషమంటే అంటున్న నాగబాబు

6 12
ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావుపై దాడి జరగగా నిన్న జనసేన శ్రీకాళహస్తి ఇంచార్జి పై దాడి జరింగింది. ఇంకా అనేక చోట్ల నామినేషన్లు వేయడానికి వెళ్లిన ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. వారి వద్ద నుంచి నామినేషన్ల పత్రాలు లాక్కుని పారిపోయిన ఘటనలు చాలా జరిగాయి. పలుచోట్ల నామినేషన్ పత్రాలు చించివేయడం కూడా జరిగింది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు ఆందోళనలకు దిగుతున్నారు.

టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇలా వరుస దాడులు జరుగుతుండడంతో ఏపీలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లని దుస్తులు ధరించిన ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ కర్ర తీసుకుని దాడి చేయడానికి రాగా అతడికి ఎదురెళ్తూ ఓ పెద్దాయన తొడకొడుతూ ముందుకెళుతున్న వీడియో ప్రస్తుతం టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోను నటుడు, జనసేన నేత నాగబాబు షేర్‌ చేసారు. “అదీ పౌరుషం అంటే.. వైసీపీ వారి గూండాగిరికి నిలబడ్డ పెద్దాయన” అని పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో మరింత వైరల్‌ అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu