ఎండాకాలం వచ్చింది అంటే పూర్వకాలంలో ఇంటిల్లిపాది కూర్చొని పచ్చళ్ళు పెట్టుకునేవారు. అయితే ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు బిజీ కావడంతో ఎవరికీ కుదరడం అటువంటి అవకాశం రావడం లేదు. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. మళ్ళీ పాతకాలం పద్దతులను బయటకు తీస్తున్నారు.
ఈ లాక్డౌన్ నేపధ్యంలో ప్రతి ఒకరు ఎదో ఒక పనిలో నిమగ్నమైపోతున్నారు. తాజాగా మెగా కుటుంబం పచ్చళ్ళు పెట్టే పని పెట్టుకుంది. మెగా డాటర్ నిహారిక ఇంట్లో స్పెషల్ గా మామిడికాయతో ఊరగాయ పచ్చడి పెడుతూ బిజీగా ఉంది. మామిడికాయ పచ్చడి పెట్టిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.