HomeTelugu Newsమందుకొట్టి కారు నడిపినందుకు ప్రాణం బలి

మందుకొట్టి కారు నడిపినందుకు ప్రాణం బలి

8 13
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌ కారణంగా మరో ప్రాణం బలైపోయింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మద్యం తాగి వాహనం నడపొద్దని ఎంతగా ప్రచారం చేస్తున్నా మందుబాబులు తమ పంథాను మార్చుకోలేకపోతున్నారు. మాదాపూర్‌లోని ఓ పబ్‌లో మద్యం సేవించిన నలుగురు విద్యార్థులు.. కారులో బయల్దేరారు.. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అతివేగంగా వెళ్లిన కారు హైదరాబాద్ మెట్రో రైలు పనుల్లో ఉన్న క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మనీష్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు తీవ్రంగా గాయపడగా.. వీరిలో ఐశ్వర్య అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థితో పాటు ముందు సీట్లో ఉన్న విద్యార్థిని స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ఎయిర్‌బెలూన్స్ తెరుచుకోవడంతో వీరు ప్రాణాలతో బయటపడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక, బ్యాక్ సీట్లో ఉన్న మనీష్ అక్కడికక్కడే మృతిచెందాడు.. ఇక వెనుక సీట్లో కూర్చున్న ఐశ్వర్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్న నలుగురు స్నేహితులు నేరేడ్‌మెట్ ప్రాంతానికి చెందినవారిగా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu