మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైరా’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ‘సైరా’. ఈ మూవీ టీజర్ను ఆగస్టు 20న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రామ్ చరణ్ సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. టీజర్కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందంటూ.. పోస్టర్ను షేర్ చేశారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.