రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. వంశీ డైరెక్టర్గా డెబ్యూ ఇస్తున్నాడు. 1970స్ కాలంలో స్టూవర్ట్పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ లుక్ విడుదల చేశారు. ఈ పాటను అక్టోబర్ 12న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రవితేజ బీడి కాలుస్తూ..తలపాగా చుట్టుకొని కొంచెం సీరియస్గా కనిపిస్తుంటే.. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ తన ప్రియుడి ఒడిలో వాలిపోయి ఈ పాట పాడుకుంటుందని లుక్తో తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణంగా నటిస్తుండగా.. బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.