HomeTelugu Trendingముంబైలోని గ్రాండ్‌ పార్టీకి విజయ్‌, రష్మికలకు మాత్రమే ఆహ్వానం

ముంబైలోని గ్రాండ్‌ పార్టీకి విజయ్‌, రష్మికలకు మాత్రమే ఆహ్వానం

Karan johar praises on toll

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ పుట్టిన రోజు నేడు. నేటితో ఆయన 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం తన నివాసంలో గ్రాండ్‌ పార్టీని నిర్వహించబోతున్నాడు కరణ్‌. ఈ సందర్భంగా బాలీవుడ్‌కు చెందిన తారలతో పాటు లైగర్‌ టీం కూడా ఈ బర్త్‌డే పార్టీలో సందడి చేయబోతోంది.అయితే ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ నుంచి కేవలం రష్మికకు మాత్రమే ఇన్విటేషన్‌ అందడం గమనార్హం. దీంతో ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.

ఈ పార్టీకి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. షారుక్ ఖాన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, అలియా భట్, రన్బీర్ కపూర్, జాన్వీ కపూర్ తో పాటు పలువురు హాజరుకానున్నట్లు సమాచారం. దక్షిణాది నుంచి విజయ్‌ దేవరకొండతో పాటు రష్మిక మందన్నాకు ఆహ్వానం అందిందని సమాచారం.కాగా విజయ్‌ హీరో తెరకెక్కిన ‘లైగర్‌’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్‌లో కరణ్‌ జోహార్‌ నిర్మించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu