టీడీపీకు సాదినేని యామినీశర్మ రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు గురువారం ఆమె రాజీనామా లేఖ రాశారు. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.