ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా.. ఇప్పుడు ఇదే ఫార్ములాను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనుసరించారు. కొత్త రాజకీయాలకు తెరతీశారు. ఎవ్వరూ ఊహించని వారికి టికెట్లు ఇచ్చారు. అఖిల భారత, ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర ఉద్యోగులకు కూడా టికెట్లు ఇచ్చారు. నవతరం యువకులకు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టని వారికి సైతం భోరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ టికెట్ కేటాయించడం విశేషం.
బాపట్ల నుంచి ఎస్సీ దళిత సామాజికవర్గానికి చెందిన నందిగం సురేష్ కు టికెట్ ఇచ్చి జగన్ ఆశ్చర్యపరిచాడు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన తనకు సీటు వస్తుందని అస్సలు ఊహించలేదని.. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేని తనకు బాపట్ల లోక్ సభ సీటు ఇవ్వడం సంతోషంగా ఉందని సురేష్ వ్యాఖ్యానించారు.
ఇక అనంతపురం లాంటి రెడ్డీల కోటలో కూడా బీసీల్లో మెజార్టీ వర్గంగా ఉన్న బోయ సామాజికవర్గం నుంచి రంగయ్య, కురుబ సామాజికవర్గం నుంచి పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ కు జగన్ టికెట్ కేటాయించి తన గొప్పతననాన్ని చాటుకున్నారు. బీసీల అభ్యున్నతికి వైసీపీ చిత్తశుద్ధిని దీన్ని బట్టి అర్థమైందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వీరిద్దరూ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులుగా విధులు నిర్వర్తించారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు బెదిరింపు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇలా ధైర్య శీలురకు జగన్ సీట్లు ఇచ్చి గౌరవించడం విశేషంగా చెప్పవచ్చు.