
శర్వానంద్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతుంది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో సినిమా ప్రమోషన్స్ చేయనున్నారు.
ఈ సినిమాలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను టైటిల్ తెలియజేసేలా ఉంది. ఖుష్బు, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సౌండ్ట్రాక్లు అందించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
#AadavalluMeekuJohaarlu Releasing in Theaters on February 25 💥💥#AMJOnFEB25
@iamRashmika @DirKishoreOffl @realradikaa @khushsundar #Urvashi @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/Z8I7ssvapf
— Sharwanand (@ImSharwanand) January 28, 2022













