HomeTelugu Trending'ఆడవాళ్లు మీకు జోహార్లు' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Aadavallu meku joharlu movi

శర్వానంద్​, రష్మిక మందన్నా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమాకు కిశోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా రాబోతుంది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని మేకర్స్​ ప్రకటించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో సినిమా ప్రమోషన్స్​ చేయనున్నారు.

ఈ సినిమాలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను టైటిల్​ తెలియజేసేలా ఉంది. ఖుష్బు, రాధిక శరత్​ కుమార్​, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్​స్టార్ దేవిశ్రీ ప్రసాద్​ సౌండ్​ట్రాక్​లు అందించగా, శ్రీకర్ ప్రసాద్​ ఎడిటర్​గా బాధ్యతలు నిర్వర్తించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!