
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తుంది. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.
High Voltage Action Entertainer #TeesMaarKhan Worldwide Grand Releasing on August 19th 💫🔥 ! #AadiSaiKumar #NagamTirupathiReddy @starlingpayal @Mee_Sunil @shamna_kkasim @kalyankumarraja @ThirmalYalla @ImSaiKartheek @TheSaiSatish pic.twitter.com/toP7TSB5O4
— BA Raju’s Team (@baraju_SuperHit) July 8, 2022













