ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ బాలిరెడ్డి.. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్గా నియమిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో ఎస్వీబీసీ ఛైర్మన్గా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పదవిని ఫృథ్వీరాజ్కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.