‘సునిశిత్’ అనే జూనియర్ ఆర్టిస్ట్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్నాడు. ప్రతి విషయంలో తనకు అవగాహన ఉందని, బాహుబలి సినిమాలో పాటలు పాడానని, తనకు అన్ని విషయాలు తెలుసని చెప్తూ పాపులర్ కావడానికి ట్రై చేస్తున్నాడు. ఒకదానితో మరొకటి సంబంధం లేని విషయాలను గురించి మాట్లాడుతూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాడు.
ఇటీవలే కొన్ని యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ, లావణ్య త్రిపాఠికి వివాహం జరిగిందని మాట్లాడాడు. అంతేకాదు, లావణ్యతో ఎఫైర్ ఉందని, తమన్నాతో కూడా ఎఫైర్ ఉందని సునిశిత్ మాట్లాడాడని చెప్పి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. నటి లావణ్య ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.