యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్జా’. సునీల్, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈసినిమాకు సంబంధించిన టీజర్ను నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేశారు. ‘దర్జా’ టీజర్ బాగుంది. ఆడియన్స్ను ఈ సినిమా ఎంటర్టైన్ చేసేలా ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని నిర్మాత డి.సురేష్బాబు అన్నారు.
‘ఈ బండి కనకమహాలక్ష్మిది. సరకు మీద చేయి పడితే చావు చూపిస్తది’, ‘ఎవరైనా ఈ కనకాన్ని టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ లాంచ్ వేడుకలో ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ అక్వా అసోసియేషన్ చైర్మన్ భూమాల శ్రీరామ్ మూర్తితో పాటు చిత్రయూనిట్ పాల్గొంది. ఈ సినిమాను కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు.