HomeTelugu Trendingసాయి ధరమ్‌ తేజ్‌పై ఛార్జ్ షీట్!

సాయి ధరమ్‌ తేజ్‌పై ఛార్జ్ షీట్!

sai dharam tej
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ సెప్టెంబర్‌ 10న బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో బయటపడిన తేజ్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇకపోతే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు పంపారు. ఏ నోటీసులపై ఇప్పటివరకు తేజు స్పందించలేదని, అందుకే అతనిపై త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

ప్రమాదం జరిగినప్పుడే కేసు నమోదు చేశామని, అందువల్ల లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేశామని తెలిపారు. కానీ, తేజు ఆ నోటీసులకు స్పందించలేదని, అందుకే అతనిపై త్వరలోనే ఛార్జ్ షీట్ ని దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మరి ఈ విషయమై మెగా మేనల్లుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu