HomeTelugu Trendingబ్రహ్మానందానికి కృతజ్ఞతలు తెలిపిన ఉదయ భాను

బ్రహ్మానందానికి కృతజ్ఞతలు తెలిపిన ఉదయ భాను

3 26
ప్రముఖ యాంకర్, నటి ఉదయ భాను బ్రహ్మానందానికి ఓ ఛాలెంజ్ విసిరారు. దానికి సై అన్న బ్రహ్మానందం మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మూడోవిడతను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఉదయభాను మొక్కలు నాటి బ్రహ్మానందానికి ఛాలెంజ్ విసిరింది. ఈ సందర్భంగా తాను విసిరిన ఛాలెంజ్‌కు స్పందించి మొక్కలు నాటిన బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అనేక మంది మొక్కలు నాటాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. సృష్టిని కాపాడేందుకు తపస్సు చేస్తున్నది కేవలం చెట్టు మాత్రమేనని తెలిపింది. ఇది అక్షర సత్యం ప్రకృతిపట్ల ఆయనకు ఉన్న బాధ్యతను నాతో పంచుకున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్‌ కుమార్ గారికి అభినందనలు అని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu