HomeTelugu Big StoriesGuntur Kaaram: మహేష్‌ ఆల్‌టైమ్‌ రికార్డు.. ఫేక్‌ అంటూ నెటిజన్ల ట్రోల్స్‌

Guntur Kaaram: మహేష్‌ ఆల్‌టైమ్‌ రికార్డు.. ఫేక్‌ అంటూ నెటిజన్ల ట్రోల్స్‌

Guntur kaaram first week coGuntur Kaaram: సూపర్‌ స్టార్‌ మ‌హేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్సిడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ మూవీలో మ‌హేష్ యాక్టింగ్‌, ఎన‌ర్జీ లెవెల్స్ లో ఉన్నాయి. త్రివిక్ర‌మ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. ర‌మ్య‌కృష్ణ‌, జ‌య‌రాం, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

తాజాగా ఈసినిమా ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్‌. వారం రోజుల్లో ఈ మూవీ 212 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు పేర్కొన్న‌ది. ఈ మేర‌కు మ‌హేష్ బాబు కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఆల్ టైమ్ రికార్డ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. రీజ‌న‌ల్ మూవీస్‌లో వారం రోజుల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీ గుంటూరు కారం అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.

యావ‌రేజ్ టాక్‌తోనే బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హేష్‌బాబు కుమ్మేశాడ‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ఏడు రోజుల్లో గుంటూరు కారం మూవీ 106 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. గురువారం రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఎనిమిదిన్న‌ర కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 132 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో గుంటూరు కారం రిలీజైంది.

బ్రేక్ ఈవెన్‌కు ఇంకో 27 కోట్ల దూరంగా ఈ మూవీ నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు 74 శాతం వ‌ర‌కు ఈ మూవీ రిక‌వ‌రీ సాధించింది. మ‌హేష్ బాబు ఓన్ థియేట‌ర్ ఏఎంబీలో వ‌రుస‌గా కోటి రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన నాలుగో మూవీగా గుంటూరు కారం రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్లు థియేట‌ర్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించిన‌ట్లు స‌మాచారం.

కాగా గుంటూరు కారం 212 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ పోస్ట‌ర్‌ను కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మూవీకి చాలా ఏరియాల్లో క‌లెక్ష‌న్స్ త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని, అలాంట‌ప్పుడు రెండు వంద‌ల కోట్లు ఎలా వ‌స్తాయ‌ని అంటున్నారు. ఫేక్ క‌లెక్ష‌న్స్ ఇవ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమా టికెట్ రేట్ల‌ను త‌గ్గించారు. ఫ‌స్ట్ వీక్‌లో టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు తీసుకున్నారు నిర్మాత‌లు. గ‌డువు ముగియడంతో ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి నార్మ‌ల్ రేట్స్‌కు ఈ మూవీని స్క్రీనింగ్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన నల‌భై ఐదు రోజుల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu