దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్ కానుందట. మొదట ఐశ్వర్యరాయ్ని ఈ పాత్ర కోసం అడిగారట రాజమౌళి.
చివరకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి సినిమాలో లేడీ విలన్ అంటే.. ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాజమౌళి ‘మగధీర’లో మిత్రవిందగా యువతరాన్ని ఉర్రూతలూగించింది కాజల్.
మళ్లీ ఇప్పుడు అదే రాజమౌళి దర్శకత్వంలో నెగెటివ్ పాత్ర చేయనుండటం నిజంగా ఆసక్తికరమైన విషయమే. మరీ దీని నిజం ఎంతుందో తెలియాలంటే.. రాజమౌళి అధికారీకంగా ప్రకటించాల్సిందే. ఈ చిత్రాన్ని రచయిత విజయేంద్రప్రసాద్ రెండు భాగాలుగా రాయాలనుకున్నారట.