HomeTelugu Newsతెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మి పార్వతి

తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మి పార్వతి

8 5ఎన్టీఆర్ భార్యగా గతంలో లక్ష్మి పార్వతి తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరణానంతరం ఆమె పార్టీకి దూరంగా ఉన్నది. ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో పార్టీని ప్రారంభించి కొన్నాళ్ళు నడిపించింది. ఆ తరువాత పార్టీకి కూడా దూరంగా ఉన్నది. 2019 ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో జాయిన్ అయ్యింది.

వైసీపీలో ఉంటూ బాబును, తెలుగుదేశం పార్టీ నేతలను విమర్శిస్తూ వస్తున్నది. వైసీపీలో చేరిన తరువాత ఆమెకు ప్రధాన కార్యదర్శి పోస్టింగ్ ఇచ్చారు. కాగా, ఇప్పుడు మరో కీలకమై పదవి ఆమెను వరించింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం జారీ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu