HomeTelugu Big Storiesjanasena: జనసేనలో చేరిన 30 ఇయర్స్‌ పృథ్వీ- జానీ మాస్టర్‌

janasena: జనసేనలో చేరిన 30 ఇయర్స్‌ పృథ్వీ- జానీ మాస్టర్‌

Actor prithviraj jani maste

janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చాడు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, సినీ నటుడు 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ కూడా ఈరోజు జనసేన పార్టీలో చేరారు. పృథ్వీకి పవన్‌ కళ్యాణ్‌ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

జానీ మాస్టర్‌ పొలిటికల్‌ ఎంట్రీతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే నెల్లూరు జిల్లా నుంచి జానీ మాస్టర్‌ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా.. పార్టీ కోసం ప్రచారం చేస్తారనే టాక్‌ కూడా ఉంది. వీటిలో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu