HomeTelugu Big Storiesఛానల్‌ ప్రారంభించనున్న ఎన్టీఆర్‌ భార్య...

ఛానల్‌ ప్రారంభించనున్న ఎన్టీఆర్‌ భార్య…

11 16టాలీవుడ్‌ స్టార్‌ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. ఎంబీఏ కంప్లీట్ చేసిన లక్ష్మీ ప్రణతి 2011లో తారక్ ని వివాహం చేసుకొని హౌజ్ వైఫ్ గా ఉండిపోయింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు అభయ్ రామ్ భార్గవ్ రామ్ ఆలనాపాలనా చూసుకుంటోంది. అయితే లక్ష్మి ప్రణతి త్వరలోనే ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించబోతోందట. కాగా లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాస్ ‘స్టూడియో ఎన్’ అనే న్యూస్ ఛానల్ స్థాపించిన సంగతి తెలిసిందే. అదే కోవలో నార్నె శ్రీనివాస్ చెల్లెలు కూడా ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్థాపించబోతోందట. ఈ ఛానల్ కి లక్ష్మీ ప్రణతి ఎండీగా ఉండే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఛానల్ పేరు ‘యువ’ అని.. ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది అని మీడియా వర్గాల్లో అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ఛానల్ కి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu