ఏపీ మంత్రి లోకేష్ ‘కోడి కత్తి’ కేసును అంతర్జాతీయ విచారణ సంస్థకు అప్పగించినా నిజం మారదని అన్నారు. ‘ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ కోడి కత్తితో యుద్ధానికి కాలుదూస్తున్నారు. తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి కొత్త డైరెక్టర్ని పెట్టినంత మాత్రాన రక్తి కట్టదు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజా ధనాన్ని నిలువునా దోచిన జగన్కు కేసుల నుంచి విముక్తి కల్పించి ఆంధ్రప్రదేశ్ ని దెబ్బతియ్యాలని కేంద్రం మరో కుట్రకి తెరలేపిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీబీఐ ఇప్పుడు బీబీఐగా మారిందనడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఉండదని… ఆంధ్రా మోడీ ని కాపాడటానికి ఢిల్లీ మోడీ.. సీబీఐని బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మార్చారని లోకేష్ ఎద్దేవా చేశారు.
కోడికత్తి కేసు అంతర్జాతీయ విచారణసంస్థకి అప్పగించినా నిజం మారదు. ఢిల్లీమోడీ, ఆంధ్రామోడీ కోడికత్తితో యుద్ధానికి కాలుదూస్తున్నారు. తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి కొత్త డైరెక్టర్ని పెట్టినంత మాత్రాన రక్తి కట్టదు. https://t.co/GAMkn4NyNX
— Lokesh Nara (@naralokesh) January 4, 2019