HomeTelugu Trendingలూసిఫర్ సీక్వెల్‌ 'ఎల్2ఇ: ఎంపురాన్'

లూసిఫర్ సీక్వెల్‌ ‘ఎల్2ఇ: ఎంపురాన్’

Lucifer sequel

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన మ‌ల‌యాళం స‌హా ప‌లు భాష‌ల్లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి అల‌రించారు. 2019లో ఈయ‌న డైరెక్ట్ చేసిన సినిమా ‘లూసిఫ‌ర్’ ఎంత‌టి ఘ‌న విజయాన్ని సాధించిందో తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా ‘ఎల్2ఇ: ఎంపురాన్’ చిత్రం రూపొందించబోతున్నారు.

‘ఎల్2ఇ: ఎంపురాన్’ సినిమా మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో రూపొందించనున్నారు. లూసిఫర్‌ను తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. లూసిఫర్ సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమా ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యాన‌ర్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేర‌ళలో సినీ నిర్మాణరంగంలోకి లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అడుగుపెడుతున్న సంద‌ర్భంగా కేర‌ళ ప్రాంతం ఆయ‌న‌కు హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ఆశ్వీర్వాద్ సినిమాస్ ప్రకటించింది.

‘లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్‌ వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఎప్పుడూ ఆస‌క్తిని చూపుతుంటారు. లైకా ప్రొడక్షన్స్ మలయాళంలో సినిమాల తీయటానికి సిద్ధమవటం అనేది చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహ‌దం చేయ‌ట‌మే కాదు, ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల‌కు ఎన్నో కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను చూసే అవ‌కాశాల‌ను కలిగిస్తుందనీ, తమ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్ట్‌లో చేతులు క‌లిపినందుకు వారికి మా ధ‌న్య‌వాదాలని ఆంటోని పెరంబవూర్ అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu