HomeTelugu Trendingమలైకా పోస్ట్‌పై మండిపడ్డ నెటిజన్లు.. దెబ్బకు పోస్ట్‌ మార్చిన నటి.!

మలైకా పోస్ట్‌పై మండిపడ్డ నెటిజన్లు.. దెబ్బకు పోస్ట్‌ మార్చిన నటి.!

13 7‘టెన్‌ ఇయర్‌ ఛాలెంజ్‌’ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖులతోపాటు సామాన్యులు కూడా పదేళ్ల క్రితం దిగిన ఫొటోను, ఇప్పటి ఫొటోను జత చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తమ జీవితం, కెరీర్‌ గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో మలైకా పాల్గొన్నారు. షారుక్ ఖాన్‌ ‘దిల్‌సే’ (1998)‌ సినిమాలోని ‘ఛైయ్య ఛైయ్య..’ ప్రత్యేక గీతంలో తన స్టిల్స్‌ను, తాజాగా దిగిన స్టిల్స్‌‌ను జత చేసి రెండు ఫొటోలు షేర్‌ చేశారు. ”నా ‘టెన్‌ ఇయర్‌ ఛాలెంజ్‌’.. గత పదేళ్లు అద్భుతంగా గడిచాయి. రాబోతున్న పదేళ్ల కోసం ఎదురుచూస్తున్నా’ అని రాశారు.

మలైకా పోస్ట్‌పై నెటిజన్లు మండిపడ్డారు. పదేళ్లంటూ.. ఇరవై ఏళ్ల ఫొటోను షేర్‌ చేస్తావా? అని విమర్శించారు. అంతేకాదు 1998 నుంచి 2018 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా తెలియదా అని ప్రశ్నించారు. అందం ఉందే కానీ.. తెలివి లేదని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇలా విమర్శలు వెల్లువెత్తడంతో మలైకా ఆ పోస్ట్‌‌ను మార్చేశారు. ’10‌ ఇయర్‌ ఛాలెంజ్‌’ను కాస్త ’20 ఇయర్‌ ఛాలెంజ్‌’ గా చేశారు.

బోనీ కపూర్‌ కుమారుడు అర్జున్‌ కపూర్‌తో మలైకా ప్రేమలో ఉన్నారు. ఇద్దరు కలిసి పార్టీలు, ఫంక్షన్లలో జంటగా సందడి చేస్తున్న ఫొటోలు చాలా బయటికి వచ్చాయి. మలైకాతో డేటింగ్‌ వార్తలపై అర్జున్‌ స్పందిస్తూ.. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

 

13a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu