స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి- యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. ఇటీవలే ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతుంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీ సెలబ్రెటీల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా విభిన్న కథాశంతంలో ఉన్న ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా, మహిళల కోసం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఉచిత షో ప్రదర్శించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఈ ఫ్రీ షో ఉండనుంది. ఈ వివరాలను తాజాగామూవీ యూనిట్ వెల్లడించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నగరాల్లోని కొన్ని థియేటర్లలో సెప్టెంబర్ 14న మహిళల కోసం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓ ఉచిత షో ఉంటుందని యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. సిటీలు, థియేటర్ల వివరాలను ట్వీట్ చేసింది. 14వ తేదీన ఈ స్పెషల్ మార్నింగ్ షోను ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలు ఉచితంగా వీక్షించవచ్చని తెలిపింది.
Mark your calendars! 🤩
The special screening of #MissShettyMrPolishetty is happening this Thursday for Ladies in select theatres across AP/TS 🙌🏻
Check out the list.
𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐞𝐫 𝐎𝐟 𝐓𝐡𝐞 𝐘𝐞𝐚𝐫 #MSMP💥#BlockbusterMSMP #TheQueenisBack… pic.twitter.com/oxthZV11uG
— UV Creations (@UV_Creations) September 12, 2023