Homeతెలుగు Newsవైసీపీ గూటికి టీడీపీ ఎంపీ తోట నరసింహం, పీవీపీ

వైసీపీ గూటికి టీడీపీ ఎంపీ తోట నరసింహం, పీవీపీ

7 12కాకినాడకు చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం దంపతులు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌ సమక్షంలో బుధవారం వారు పార్టీ కండువా కప్పుకున్నారు.

కాకినాడ ఎంపీ తోట నరసింహం వైసీపీలో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తన భార్య వాణికి అడగ్గానే పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు వైసీపీ అవకాశం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి పీవీపీ పేరును దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu